బడ్జెట్‌ ప్రసంగం.. నిర్మలా సీతారామన్ రికార్డు

2020 బడ్జెట్ సమర్పణ సందర్భంగా 2.42గంటల ప్రసంగం

Nirmala Sitaraman Budget
Nirmala Sitaraman Budget

న్యూఢిల్లీ: లోక్ సభలో 2020-21 బడ్జెట్ .. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగం లోక్ సభ చరిత్రలో అతి సుదీర్ఘ కాలం సాగిన బడ్జెట్ ప్రసంగంగా నిలిచిపోనుంది. నిర్మల తన బడ్జెట్ ప్రసంగాన్ని 2 గంటల 42 నిమిషాలపాటు కొనసాగించారు. కాగా గత ఆర్థిక సంవత్సరం 2019-20 గాను నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ సమర్పిస్తూ ఆమె రెండుగంటల 15 నిమిషాలపాటు ప్రసంగించగా అప్పటికి అదే సుదీర్ఘకాలం సాగిన బడ్జెట్ ప్రసంగంగా గుర్తింపపొందగా, తాజాగా నిర్మల తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. అంతకుముందు.. 2003-04 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను సమర్పించిన అప్పటి ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ 2 గంటల 13 నిమిషాలపాటు ప్రసంగించి తర్వాతి స్థానంలో ఉండగా, మూడో స్థానంలో అరుణ్ జైట్లీ నిలిచారు. జైట్లీ 2014-15 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పిస్తూ.. 2 గంటల 10 నిమిషాలపాటు ప్రసంగించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/