గీతం వ్యవస్థాపకులు మూర్తికి నివాళులర్పించిన లోకేశ్
అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్ గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎమ్వీవీఎస్ మూర్తి జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. విద్యపై మమకారంతో గీతం విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దేశంలోనే ఉన్నత ప్రమాణాలు కలిగిన ఒక పెద్ద విద్యావ్యవస్థగా తీర్చిదిద్దారని ఆయన ట్వీట్ చేశారు. టిడిపి సీనియర్ నేతగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/