క‌ల్తీ సారా మరణాలపై ఏడో రోజు టీడీపీ నిర‌స‌న‌

కల్తీ సారా మృతుల పాపం జగన్ రెడ్డిదే అంటూ ప్లకార్డులు

అమరావతి : ఏపీలో క‌ల్తీ సారా మరణాలపై టీడీపీ ఏడవ రోజు కూడా నిర‌సన తెలిపింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆధ్వర్యంలో పార్టీ శాసనసభా పక్ష నేతలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. కల్తీ సారా మృతుల పాపం జగన్ రెడ్డిదే అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఏపీలో మధ్య నిషేధంపై అసెంబ్లీలో చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు. అమ‌రావ‌తిలోని సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి ఈ ర్యాలీ జ‌రిగింది. కల్తీ నాటు సారా, జే బ్రాండ్ మద్యం వల్ల ఏపీలో ప్ర‌జ‌లు చనిపోతున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/