వైసీపీ నేతలను గాడిదలతో పోల్చిన లోకేష్

lokesh-slams-ysrcp

కుప్పం మునిసిపాలిటీ ఎన్నిక ఇప్పుడు వాడి వేడిగా సాగుతోంది. ఆంధ్రాలో జరుగుతోన్న మునిసిపల్ ఎన్నికల్లో కుప్పం మునిసిపాలిటీ పైనే అందరి దృష్టీ ఉంది. తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తోన్న చోటు కావడంతో, ఈ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్. ఈ తరుణంలో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సత్తా చాటుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంటే..రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన విజయ డంఖా మోగిస్తున్న వైసీపీ..ఈ ఎన్నికల్లో కూడా క్లిన్ స్వీప్ చేయాలనీ చూస్తుంది. ప్రస్తుతం ప్రచారం తో అన్ని పార్టీలు బిజీ అయ్యాయి.

కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 1వ వార్డు బండ శెట్టిపల్లి ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గాడిదకు గంధం వాసన తెలియనట్లు .. వైసీపీ వాళ్ళకు చంద్రన్న గొప్పతనం తెలియట్లేదని ఎద్దేవా చేశారు. వాళ్ళకు పసుపు జెండా చూడగానే ఎందుకంత భయం..? గతంలో ఎప్పుడైనా ఇంత అరాచకాలను చూశారా..? దేవాలయంలా ఉన్న కుప్పంను చెడగొట్టిన దౌర్భగ్యం వైసీపీ వారిదని నిప్పులు చెరిగారు.

రెండున్నరేళ్లుగా కుప్పంను పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు వచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని విమర్శించారు. వైసీపీ రౌడీలు, గుండాలు, ఎర్ర చందనం స్మగ్లర్లు ప్రశాంతమైన కుప్పం వచ్చి అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం బాటిల్ దగ్గర్నుంచి నిత్యం తినే పప్పు, ఉప్పు వరకు అన్ని రకాల ధరలను వైసీపీ అమాంతం పెంచేసిందన్నారు. రౌడీలు గూండాలకు భయపడకుండా ఓటు వేసి టీడీపీని గెలిపించాలని లోకేష్ కోరారు.