జస్టిస్‌ బోబ్డే, స్పీకర్‌ ఓం బిర్లాలకు భద్రత పెంపు

ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు

Om Birla-Justice Bobde
Om Birla-Justice Bobde

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు భద్రత పెంపుపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా సంస్థల నివేదిక ఆధారంగా వారి భద్రతను పెంచుతూ హోం శాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం మేరకు బోబ్డే, ఓం బిర్లాకు జడ్ కేటగిరీలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించనున్నట్టు సమాచారం.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/