మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ల వైపుగా మిడతల దండు
నిసర్గ్ తుపాను గాలుల ప్రభావానికి ఝార్ఖండ్ వైపుగా పయనం
గోదావరిఖని: నిస్గర్ తుపాను కారణంగా మిడతల సమూహం నాగ్పూర్, రాంటెక్ మీదుగా మధ్యప్రదేశ్, ఝార్ఖండ్లవైపుగా పయనించినట్టు అధికారులు గుర్తించారు. కాగా మిడతల దండు నివారణ కోసం ప్రభుత్వం నియమించిన అధికారుల ప్రత్యేక బృందం పర్యటన బుధవారం ముగిసింది. గత ఐదు రోజలనుండి ఈ బృందం రామగుండం కేంద్రంగా పర్యవేక్షిస్తుంది. అలాగే, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించింది. నిన్నటితో పర్యటన ముగియగా, ప్రయోగం కోసం కొన్ని మిడతలను ఈ బృందం తీసుకెళ్లింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/