మే 3 తర్వాత రెడ్ జోన్లు లో లాక్ డౌన్ మరింత కఠినం

కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy

Hyderabad: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మే 3 తర్వాత ఎక్కడైతే రెడ్ జోన్లు, కంటోన్మెంట్ లు ఉంటాయో ఆ ప్రాంతాలలో  లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

బుధవారం విలేకరులతో మాట్లాడిన ఆయన అన్ని రాష్ట్రాలూ కూడా లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరుతున్నాయన్నారు.

కేంద్రం కూడా అలాగే భావిస్తున్నదని పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదురౌతున్నప్పటికీ, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలన్నా, దేశాన్ని రక్షించుకోవాలన్నా లాక్ డౌన్ తప్పదని అన్నారు

. ఈ విషయంలో ప్రజలు అర్ధం చేసుకుని అందిస్తున్న సహకారం అపూర్వమన్నారు. కరోనాపై యుద్ధంలో ప్రతి పౌరుడూ ఒక సైనికుడిగా సహకరిస్తున్నారని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/