లాక్ డౌన్ వల్ల దేశ ఆదాయం పడిపోయింది

ప్రజలంతా కరోనాతో కలిసి జీవించాలి..ఇమ్రాన్ ఖాన్

Imran-Khan
Imran-Khan

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను త్వరలోనే ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదని, వైరస్ ను అది అరికట్టలేదని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే ప్రజలంతా వైరస్ తో కలిసి జీవించాలని అన్నారు. సంక్షోభ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నగదు బదిలీ చేశామని… ఇకపై ఎవరికీ సహాయం అందించలేమని స్పష్టం చేశారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. లాక్ డాన్ వల్ల దేశ ఆదాయం దారుణంగా పడిపోయిందని… ఇకపై నష్టాన్ని తట్టుకునే శక్తి పాకిస్థాన్ కు లేదని ఇమ్రాన్ తెలిపారు. పేదలకు సాయం చేసేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదని… అయినా ఎన్ని రోజులు ఆర్థిక సాయం చేయగలమని అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు అది విస్తరిస్తూనే ఉంటుందని… అందువల్ల దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/