లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలి
ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అమిత్ షా ..సిఎంలకు సూచన
న్యూఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్రమోడి రాష్ట్రల ముఖ్యమంత్రులతో నిర్వహించి వీడియోస్ కాన్ఫరెన్స్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పాల్గొని సిఎంలతో మాట్లాడినట్లు తెలిసింది. ఈనేపథ్యంలో అమిత్షా కరోనా వైరస్ నిమిత్తం దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా నిలువరించాలని ఆయన సూచించారు.దేశంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని, ఇది దీర్ఘకాలిక పోరాటం అని, నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఈపోరాటంలో ఓపిక అవసరమని సీఎంలకు ఆయన సూచించినట్టు సమాచారం. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఖకరోనాగ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో పరిస్థితి బాగుందని అమిత్ షా అన్నట్టు తెలిసింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/