నిబంధనలు సడలించిన ఏపి ప్రభుత్వం

ఇతర రాష్ట్రాల నుంచి ఏపికి వచ్చేవారి కోసం ఆటోమేటిక్ ఈపాస్

lockdown-relaxations-to-other-state-people-in-ap

అమరావతి: ఏపి ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి కోసం నిబంధనలు సడలించింది. ఇకపై, ఎవరైనా రాష్ట్రానికి రావాలనుకుంటే స్పందన పోర్టల్ లో దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ ఈపాస్ జారీ అవుతుంది. పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసిన వెంటనే మొబైల్ నెంబర్ కు, ఈమెయిల్ కు ఈపాస్ వస్తుంది. అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద సిబ్బందికి ఈపాస్ తో పాటు గుర్తింపు కార్డును చూపిస్తే రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతిస్తారు. ఈపాస్ ల జారీ రేపటి నుంచి అమల్లోకి రానుంది. కాగా ప్రస్తుతం దేశంలో అన్ లాక్3 ప్రక్రియ నడుస్తోంది. కరోనా వ్యాప్తి కోసం విధించిన లాక్ డౌన్ ను విడతల వారీగా సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపి నిబంధనలు సడలించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/