లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఎటిఎంలలో 1.27 లక్షల కోట్లు విత్‌డ్రా!

నగదుపై కరోనా తీవ్రప్రభావం

cash withdrawal through ATM
cash withdrawal through ATM

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రేరిత లాక్‌డౌన్‌ ప్రభావం డబ్బులపై కూడా పడింది. లాక్‌డౌన్‌ విధింపు నేపథ్యంలో ఈ ఏప్రిల్‌లో ఎటిఎంల నుంచి నగదు ఉపసంహరణ సగానికి పైగా తగ్గింది.

దేశవ్యాప్తంగా అన్ని ఎటిఎంల నుంచి ఈ ఏప్రిల్‌లో రూ.1.27లక్షల కోట్ల నగదును మాత్రమే ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బిఐ గణాంకాలు చెబుతున్నాయి.

అంతకుముందు నెల మార్చిలో ఎటిఎంల ద్వారా రూ.2.51 లక్షల కోట్ల ఉపసంహరణ జరిగినట్లు తెలుస్తోంది.

మార్చిలో కంటే ఏప్రిల్‌లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ వద్ద నగదు విత్‌డ్రా విలు స్వల్పంగా పెరిగాయి. ఈ ఏప్రిల్‌లో పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పిఒఎస్‌) నుంచి రూ.110 కోట్ల నగదు ఉపసంహరణ జరిగినట్లు ఆర్‌బిఐ గణాంకాలు తెలిపాయి.

ప్రజలు నిత్యావసర కొనుగోళ్లకు అత్యధికంగా డిజిటల్‌ చెల్లింపులకే మొగ్గుచూపారు. ఎటిఎంల్లో డెబిట్‌ కార్డుల ఉపయోగం కూడా సగానికి పైగా తగ్గింది.

ఈ ఏప్రిల్‌లో డెబిట్‌ కార్డులను ఉపయోగించి రూ.28.52 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చిలో ఇవే కార్డుల ద్వారా రూ.54.41 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు.

ఈ ఏప్రిల్‌ నాటికి దేశంలో మొత్తం 88.68 కోట్ల కార్డులున్నాయి. ఇందులో 82.94 కోట్ల డెబిట్‌కార్డులు, 5.73 కోట్ల క్రెడిట్‌ కార్డులున్నాయి.

అంతకుముందు నెల మార్చిలో 88.63 కోట్ల కార్డులున్నాయి. ఇదే ఏప్రిల్‌ నాటికి దేశవ్యాప్తంగా 2.34 లక్షల ఎటిఎంలు, 50.85 లక్షల పిఒఎస్‌లున్నాయి.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/