లాక్డౌన్ సడలింపు వివరాలు
మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో మే నెల 3 వరకు లాక్డౌన్ పొడగించిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి అతి తక్కువగా ఉన్న ప్రాంతాలలో కొన్ని రకాల సడలింపులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ సడలింపులు నేటి నుంచి అమలు లోకి రానున్నాయి. . అయితే లాక్డౌన్ సడలింపు ప్రాంతాలలో ఏవి పనిచేస్తాయి. ఏవి పనిచేయవు అనే విషయాలు ఇపుడు తెలుసుకుందాం.
సడలింపులు జరిపినవి
•నీరు శానిటేషన్, వేస్ట్మేనేజ్మెంట్, పవర్ రంగాలు.
•అంతరాష్ట్ర సరుకుల లోడింగ్, అన్ లోడింగ్
•ఆన్లైన్ టీచింగ్, డిస్టేన్స్ లెర్నింగ్.
•ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటిహెచ్, కేబుల్ సర్వీసులు.
•సామాజిక దూరం పాటిస్తు జాతీయ గ్రామీణ ఉపాధి హమి పనులు
•గిరిజనులు సేకరించే అటవి ఉత్పత్తులు.
•మెడికల్, వెటర్నరీ కేర్ సామాగ్రి తీసుకువెళ్లే ప్రైవేటు వాహనాలు
•కేంద్ర, రాష్ట్ర, స్ధానిక సంస్థల కార్యాలయాలు.
•బాలుర, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల వసతి గృహాలు.
•ప్రభుత్వ కార్యకలాపాల కోసం పనిచేసే డేటా సెంటర్లు, కాల్ సెంటర్లు, ఎమర్జెన్సి స్టాఫ్ కోసం హోటల్స్, లాడ్జిలు.
•గ్రామాల్లో రోడ్లు, ఇరిగేషన్ పనులు
•గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్, ఔషధాలు, మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీలు.
•ఆర్బీఐ, బాంకులు, సెబీ, ఇన్స్యూరెన్స్ కంపెనీలు.
సడలింపులు అనుమతించనివి..
•రైలు రోడ్డు విమాన ప్రయాణాలు.
•విద్యాలయాలు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్.
•పారిశ్రామిక వాణిజ్య కార్యకలాపాలు.
•సినిమా థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్సులు
•మత పరమైన కార్యక్రమాలు
•రాజకీయ సామాజిక కార్యక్రమాలు
•ఈ కామర్స్ కంపెనీలు సరాఫరా చేసే అత్యవసరం కాని వస్తువులు
•ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లే వలస కార్మికులకు అనుమతి నిరాకరణ
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/