ముంబయిలో మద్యం షాపులు మూసివేత!
భౌతిక దూరాన్ని విస్మరించిన ప్రజలు.. మద్యం దుకాణాలు మూసేయాలని అధికారుల నిర్ణయం
ముంబయి: కరోనా లాక్డౌన్ నుండి కేంద్ర మినహాయింపులు ఇస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వగా..ముంబయిలో వైన్స్ షాపులు తెరవగా అక్కడి ప్రజలు వైన్స్ షాపుల వద్ద ప్రజలు భౌతిక దూరాన్ని మరిచిపోయి దుకాణాల వద్ద బారులు తీరారు. దీంతో తీవ్రంగా స్పందించిన బృహన్ ముంబయి కార్పొరేషన్ అధికారులు, మద్యం దుకాణాలను నేటి నుంచి తెరవరాదని ఆదేశాలు జారీ చేశారు. నిత్యావసరాలు మినహా మరే ఇతర షాపులను కూడా తెరిచేందుకు వీల్లేదని ఆంక్షలు విధించారు. కాగా, ముంబయిలో తాజాగా 500కు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో, మొత్తం కేసుల సంఖ్య 9 వేలను దాటేసింది. మొత్తం మీద రాష్ట్రంలో కేసుల సంఖ్య 15 వేలను దాటడంతో ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలను తీసుకోవాలని భావిస్తోంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/