లైగర్ సెన్సార్ పూర్తి

లైగర్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ .. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీల‌క పాత్ర‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా గా పలు భాషల్లో ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చార్మీ పూరితో కలిసి బాలీవుడ్ మేకర్స్ కరణ్ జోహార్ హీరూ జోహార్ అపూర్వ మోహతా ధర్మా ప్రొడక్షన్స్ పై పూరి కనెక్ట్స్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా టీజర్ , మేకింగ్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేస్తుండగా..ఈరోజు మేకర్స్ సెన్సార్ ను పూర్తి చేసారు.

సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్రానికి U / A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే రన్ టైమ్‌ చాల తక్కువ గా ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి భారీ చిత్రాలకు కాస్తంత ఎక్కువగానే రన్‌టైమ్ ఉంటుంది. కానీ ఈ చిత్రానికి మాత్రం కేవలం 140 నిమిషాల ప్రదర్శనా సమయాన్ని నిర్ణయించడం గమనార్హం. అంటే 2 గంటల 20 నిమిషాలన్నమాట. ఫస్టాఫ్ 1గంట 15 నిమిషాలు కాగా, సెకండాఫ్ 1 గంట 5 నిమిషాల రన్ టైమ్ వచ్చింది. ఏడు ఫైట్లు, ఆరు పాటలతో పూరీ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దినట్టు సమాచారం. విజయ్ దేవరకొండ నటన అభిమానుల్ని మెప్పిస్తుందని చెబుతున్నారు. ఇక సెన్సార్ టాక్ తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది.