సోనియాకు కాంగ్రెస్ బహిష్కృత నేతలు లేఖ
ప్రస్తుతం పార్టీ నడుస్తున్న తీరు బాగోలేదు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ బహిష్కృత నేతలు సంతోష్ సింగ్, సత్యేదేవ్ త్రిపాఠి సోనియా గాంధీకి లేఖ రాశారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేశారని, ప్రజాస్వామ్య పునాదులు వేశారని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ నడుస్తున్న తీరు చూస్తుంటే కార్యకర్తల్లో గందరగోళాన్ని నెలకొల్పే విధంగా ఉందని అన్నారు. కార్యకర్తల్లో నిరాశ ఆవహిస్తోందని, భారత్ లో ప్రజాస్వామ్య విలువలు నాశనమవుతున్న ప్రస్తుత సమయంలో దేశానికి కాంగ్రెస్ అవసరం ఎంతో ఉందని వారు చెప్పుకొచ్చారు. ఆ పార్టీ సమర్థంగా కొనసాగాలని, అందుకు కుటుంబ అనుబంధాలకు అతీతంగా ఆలోచించాలని, పార్టీ సంప్రదాయాలతో పాటు ప్రజాస్వామ్య విలువలు పునరుద్ధరించాలని లేఖలో కోరారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/