నేడు జాతీయ బాలికా దినోత్సవం

ఆడబిడ్డను బతకనిద్దాం..ఆ బిడ్డకు బతుకునిద్దాం

Let that baby live

ఇటీవల కాగ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 24 శాతం కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయలేదు. పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామంటున్న పాలకులు దాన్ని మిథ్యగా మారుస్తున్నారు. ఇప్పటికైనా పాలకుల ఆలోచనా విధానం మారాలి. అధికారం కోసం కాకుండా సమాజంలో మార్పుకోసం కృషిచేయాలి. బాలికల పట్ల సమాజం ఇంత వివక్ష చూపుతున్నా దేశం పరువ్ఞను అన్ని రంగాల్లో నిలబెడుతుంది మాత్రం ఆడపిల్లలే. అలాంటి అమ్మాయిలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తే తమ సత్తా చాటుకుంటారు. లింగ సమానత్వం కోసం భ్రూణహత్యలు, పౌష్టికాహార లోపాలు, అనారోగ్యం, అవిద్య, బాల్యవివాహాలు, బాలిక అక్రమరవాణా వంటి సమస్యల పరిష్కారం కోసం మరింత చిత్తశుద్ధితో పనిచేయాలి.

స మాజంలో బాలికాసంరక్షణ పట్ల అవగాహన కల్పించడా నికి బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్యా సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడా నికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. తాజా జనగణన లెక్కల్లోనూ స్త్రీ,పురుష నిష్పత్తిలో ఆందోళనకరమైన తేడా కనిపిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు 940 మంది మాత్రమే మహిళలున్నట్లు తేలింది. అలాగే ఆరు సంవత్సరాల లోపు ఆడపిల్లలైతే ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 914 మంది మాత్రమే ఉన్నట్టు జనాభా లెక్కల్లో వెలుగు చూసింది. ఇప్పుడు ఇంకా తగ్గి ఉంటుంది. అక్షరాస్యత శాతాన్ని చూస్తే మహిళల అక్షరాస్యత శాతం 684.శాతంగా ఉంది. బాల్యవివాహాలు భారత్‌లో అధికంగా జరుగుతున్నాయి. 26.8శాతం మంది బాలికలకు బలవంతంగా వివాహాలు చేస్తున్నారు. అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 40 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయమే. ఆడపిల్లలకు అందించే విద్యావకాశాలు కూడా దయనీయంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ భారతంలో ఆడపిల్లల చదువ్ఞలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. మగ పిల్లలతో వారిని పాఠశాలల్లో చేర్పించినా, కుటుంబ ఆర్థిక అవసరాల కోసమో, ఇతర బాధ్యతలు నెరవేర్చడం కోసమో ఆడప్లిలను చదువ్ఞకు దూరం చేస్తున్నారు. ఉన్నత విద్యావకాశాలు అందుకుంటున్న మహిళలు కూడా నూటికి 10 నుండి 30 శాతం మాత్రమే ఉండటం ఇందుకు సాక్ష్యం.

నేటికీ ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్యసమస్య పోషకాహార లోపం. కుటుంబ ఆర్థిక సమస్యలతో ఏదో ఒక పనిచేసి కడుపు నింపుకోవాల్సిన దుస్థితి వస్తోంది. ఉన్న ఊర్లో పనులు దొరకక వలసలు పోతున్న ఆడపిల్లలు, అక్కడా రక్షణ లేక లైంగిక దాడుల బారిన పడుతున్నారు. కనిపించకుండాపోతున్న వారి సంఖ్య వందల సంఖ్యల్లో ఉంది. సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల ఫలితంగా బాలికలంటే కేవలం కట్నం తెచ్చే యంత్రంగానే పరిగణిస్తున్నారు. దాంతో ఆడపిల్లల పెళ్లిళ్లు భారంగా మారాయి.

దీంతో పేద తల్లిదండ్రులు తప్పని పరిస్థితుల్లో మైనార్టీ తీరకుండానే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. దాంతో వారు అతి చిన్న వయస్సులోనే తల్లులుగా మారుతు న్నారు. ఫలితంగా భవిష్యత్తులో అనేక రకాల ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారు. వీటితోపాటు రోజురోజుకూ బాలికలపై, స్త్రీలపై జరుగుతున్న ఆకృత్యాలు మరొకటి. ఆడపిల్లకు బడిలో, గుడిలో, స్నేహితుల మధ్య, బంధువ్ఞల మధ్య, అత్తగారింట్లో చివరికి ఇంట్లో కూడా ఎక్కడా సరైన రక్షణలేదు. ఆడప్లిలలపైన జరిగే ఆకృత్యాలకు అంతే లేకుండాపోయింది.

ఐదు సంవత్సరాల పాప నుండి 80 సంవత్సరాల ముదుసలి వరకు, రోజు కూలి చేసుకునే మహిళ దగ్గర నుంచి కోట్లు సంపాదించే సినీతారల వరకు, చదువ్ఞకునే అమ్మాయి నుంచి చదువ్ఞ చెప్పే ఉపాధ్యా యుల వరకు, ప్రాణాలు తీసే రౌడీల నుండి ప్రాణాలు పోసే డాక్టరు వరకు, సిల్లీగా గల్లీలో తిరిగే కుర్రకారు నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పే బాబాల వరకు ప్రపంచంలో ఎక్కడో అక్కడ ప్రతిరోజు, ప్రతి నిత్యం మనం అనేక ఆకృత్యాలు జరుగుతున్నట్లు చూస్తూనే ఉన్నాం.

వీటిని అరికట్టి బాలికలకు సమాజంలో రక్షణ ఉందనే నమ్మకాన్ని కల్పించే బాధ్యత ప్రభుత్వం, సమాజం తీసు కోవాలి. పుట్టిన పన్నెండు మిలియన్ల బాలికల్లో మూడు మిలియన్ల మంది తమ పదిహేనవ పుట్టినరోజును, ఒక మిలియన్‌ మంది తమ మొదటి పుట్టిన రోజును జరుపుకోకుండానే మరణిస్తున్నారు. లింగ వివక్ష వల్ల ప్రతి ఆరుగురిలో ఒక బాలిక చావ్ఞకి గురవ్ఞతోంది. యాభైశాతం బాలికలకు పోషకాహారం అందడం లేదు. బాలికలలో ఇద్దరిలో ఒకరు సరైన పోషకాహారం పొందడం లేదు. నేటి బాలలే రేపటి పౌరులు.

పదేపదే అనేక సందర్భాల్లో పాలకులు ఉటంకించే మాట. ప్రధానంగా బాలికలను, వారి తల్లి దండ్రులను బాగా వేధించే సమస్య బాలికల అక్రమరవాణా. పౌరు లుగా ఎదగాల్సిన బాలలు కొన్ని ముఠాల చేతుల్లో బానిసలుగా మారిపోతున్నారు. సమాజాన్ని అర్థం చేసుకునే లోపు వారి జీవితాలు నలిగిపోతున్నాయి. వారి ఆనందాన్ని, ఆశలను కొన్ని శక్తులు చిధిమేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బాలబాలి కల అక్రమ రవాణా. యూనిసెఫ్‌ ఇటీవల విడుదల చేసిన గణాం కాల ప్రకారం ఏటా ప్రపంచంలో 15వేల మిలియన్ల బాల, బాలికలు అక్రమంగా రవాణా అవ్ఞతున్నారు. భారతదేశం నుంచి 24 శాతం మంది రవాణా అవ్ఞతున్నారు.

ఇందులో ఎక్కువ మంది 15ఏళ్ల లోపు వారే. ఇలా రవాణా అవ్ఞతున్న వారిలో అధికశాతం మంది అమ్మాయిలే ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.ఈ అక్రమ రవాణా అంతా బీహార్‌, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌,మహారాష్ట్రాలతోపాటు ఢిల్లీ నుంచి ఎక్కువగా సాగుతోంది. బాలల అక్రమ రవాణాకు ప్రభుత్వాల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. పిల్లల భద్రతగానీ, వారికి కల్పించాల్సిన సదుపాయాలపైన గానీ దృష్టిపెట్టడంలేదు. ఇటీవల కాగ్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 24 శాతం కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయలేదు.

పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామంటున్న పాలకులు దాన్ని మిథ్యగా మారుస్తున్నారు. ఇప్పటికైనా పాలకుల ఆలోచనా విధానం మారాలి. అధికారం కోసం కాకుండా సమాజంలో మార్పుకోసం కృషిచేయాలి. బాలికల పట్ల సమాజం ఇంత వివక్ష చూపుతున్నా దేశం పరువును అన్ని రంగాల్లో నిలబెడుతుంది మాత్రం ఆడపిల్లలే. అలాంటి అమ్మా యిలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తే తమ సత్తా చాటుకుంటారు.

లింగ సమానత్వం కోసం భ్రూణహత్యలు, పౌష్టికాహార లోపాలు, అనారోగ్యం, అవిద్య, బాల్యవివాహాలు, బాలిక అక్రమరవాణా వంటి సమస్యల పరిష్కారం కోసం మరింత చిత్తశుద్ధితో పని చేయాలి. శాస్త్ర,సాంకేతిక, పారిశ్రామిక, రాజకీయ క్రీడారంగాల్లో కీలకపాత్ర పోషించేలా తీర్చదిద్దాలి. ఆర్థికస్వేచ్ఛ, ఉపాధి కల్పన కోసం బాలికల నైపుణ్యాలను మెరుగుపరచాలి.మంచిస్పర్శ, చెడు స్పర్శ, అనుచిత ప్రవర్తనపై బాలికలకు అవగాహన కల్పించాలి.

  • బి.వి శైలజ

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/