బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూత

ముంబయి: బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ (98) కన్నుమూశారు. ఆయన వయసు సంవత్సరాలు. ముంబయిలోని హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిలీప్ కుమార్ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శ్వాస సమస్యతో గత బుధవారం ఆయన ఆసుపత్రిలో చేరారు. జూన్ 6న తొలుత ఆయనను ఆసుపత్రిలో చేర్చగా ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుట పడడంతో అదే నెల 11న డిశ్చార్జ్ చేశారు. దిలీప్ కుమార్ మరణవార్తతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.

దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. భారతీయ సినిమాలో చిరస్థాయిగా నిలిచిపోయే నయా దౌర్, మొఘల్-ఏ-అజామ్, దేవ్‌దాస్, రామ్ ఔర్ శ్యామ్, అందాజ్, మధుమతి, గంగా జమున వంటి సినిమాల్లో నటించారు. 1940లలో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. 1980ల నుంచి కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి క్రాంతి, శక్తి, కర్మ, సౌదాగర్ వంటి సినిమాల్లో నటించారు. 1998లో వచ్చిన ‘ఖిలా’ దిలీప్ కుమార్ చివరి సినిమా.

1 డిసెంబరు 1922లో పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జన్మించిన దిలీప్ కుమార్ సినిమాల్లోకి రాకముందు తండ్రితో కలిసి పండ్లు అమ్మారు. ఆ తర్వాత ఎంతో కష్టపడి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకడిగా ఎదిగారు. 1944లో తొలిసారి ‘జ్వర్ ఖాతా’ అనే సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/