దేశంలో హింసాత్మక ఘటనలకు వామపక్షాలే కారణం
జేఎన్యూలో పరీక్షలకు అంతరాయం కలిగించేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు
గ్వాలియర్: పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జనజాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. దేశంలో హింసాత్మక ఘటనలు జరగడానికి వామపక్ష పార్టీలే కారణమని యూపీ యోగి ఆరోపించారు. దేశంలో హింసాత్మక వాతావరణానికి కారణం అవేనని దుయ్యట్టారు. ఢిల్లీ జవహర్లాల్ నేహ్రూ యూనివర్సిటీలో పరీక్షలకు అంతరాయం కలిగించేందుకు వారు ఇలాంటి కుట్ర పన్నుతున్నారని అన్నారు. సీఏఏ, జేఎన్యూ ఘటన విషయాల్లో ప్రతిపక్షాలు తప్పుడు వార్తల ప్రచారం చేస్తున్నాయని, ఫలితంగా ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. ఇలాంటి చర్యలతో దేశంలో ముగింపు దశలో ఉన్న ఉగ్రవాదం, వేర్పటువాదం మళ్లీ పురుడుపోసుకుంటున్నారని ముఖ్యమంత్రి యోగి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం పౌరులకు హక్కులను కల్పించింది. కానీ పౌరులు కూడా తమ విధులను నిర్వర్తించాలని యోగి కోరారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/