దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం టర్కీ నేర్చుకోవాలి
టర్కీ అధ్యక్షుడికి దీటుగా బదులిచ్చిన భారత్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సర్వసభ 74వ వార్షిక సమావేశాల్లో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తన వీడియో సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆయన కశ్మీర్ అంశానిన లేవనెత్తారు. కశ్మీర్ వివాదాన్ని ఐరాస నిబంధనల ప్రకారం పరిష్కరించాలని చెప్పుకొచ్చారు. గత ఏడాది జరిగిన సమావేశంలోనూ ఆయన ఇదే అంశంపై వ్యాఖ్యానించి భారత్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆయన తీరు మారలేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది.
ఐరాస భారత ప్రతినిధి తిరుమూర్తి ఈ విషయంపై స్పందిస్తూ… భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్ గురించి ఎర్డోగన్ మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ తీరును భారత్ ఏ మాత్రమూ అంగీకరించబోదని చెప్పారు. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం టర్కీ నేర్చుకోవాలని ఆయన తెలిపారు. కాగా, పాక్ కూడా కశ్మీర్ గురించి ప్రస్తావించగా భారత్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/