దుబ్బాకలో 12.74 శాతం పోలింగ్‌

dubbaka election

దుబ్బాక: ప్రశాంతంగా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ను సిబ్బంది ప్రారంభించారు. ఉదయం 9గంటల వరకు నియోజకవర్గ వ్యాప్తంగా 12.74 పోలింగ్‌ శాతం నమోదైందని ఎన్నికల అధికారి తెలిపారు. కాగా లచ్చపేటలోని స్ట్రాంగ్‌ రూమ్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతీ హొళికెరి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్‌ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్‌ శాతం నివేదికను పంపాలని ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా 104 పోలింగ్‌ కేంద్రాలను పోలింగ్‌ తీరును పరిశీలించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/