సిఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి కన్నుమూత
కొంత కాలంగా కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నా.. ఆనంద్ సింగ్ బిష్త్
యూపీ: ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్(89) కన్నుమూశారు.ఆయన కొంతకాలగా కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. మార్చి 13న ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం న్యూఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. డాక్టర్లు తీవ్రంగా యత్నించినా ఆయన్ను కాపాడలేకపోయారు. ఆనంద్సింగ్ గతంలో ఉత్తరాఖండ్ అటవీశాఖలో రేంజర్గా పనిచేసేవారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/