నేడు భారత్‌కు చేరుకోనున్న ‘ఎయిరిండియా వన్‌’

ప్ర‌ధానితో పాటు రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి కూడా ఈ విమానాన్ని వాడ‌నున్నారు..

vip-aircraft-air-india-one-is-arriving-from-us-today-report

న్యూఢిల్లీ: భారత ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనల నిమిత్తమై ప్రత్యేకంగా తయారు చేయించిన ’ఎయిర్ ఇండియా వన్’ విమానం గురువారం సాయంత్రానికి భారత్‌కు చేరుకోనుంది. అమెరికా నుంచి సాయంత్రం 3 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుటుందని అధికారులు ప్రకటించారు. అమెరికా అధ్య‌క్షుడు ప్ర‌యాణించే ఎయిర్ ఫోర్స్ విమానం త‌ర‌హాలో.. భార‌త ప్ర‌ధాని కోసం ఎయిర్ ఇండియా విమానాన్ని త‌యారు చేశారు. ప్ర‌ధాని మోడి ఆ బోయింగ్ 777 విమానాన్ని వాడ‌నున్నారు. అమెరికాలోని డ‌ల్లాస్‌లో దీన్ని నిర్మించారు. ప్ర‌ధానితో పాటు రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి కూడా ఈ విమానాన్ని వాడ‌నున్నారు. ఎయిర్ ఇండియాన వ‌న్‌లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. భ‌ద్ర‌తాప‌ర‌మైన‌ ఫీచ‌ర్లు కూడా చాలానే ఉన్నాయి.

ఒక‌సారి రీఫ్యుయ‌లింగ్ చేస్తే అప్పుడు ఎయిర్ ఇండియా వ‌న్‌.. అమెరికా నుంచి ఇండియా వ‌ర‌కు ఎక్క‌డా బ్రేక్ లేకుండా రాగ‌ల‌దు. రెండు వీఐపీ సూప‌ర్ ప్లేన్ల‌ను ఎయిర్‌ఫోర్స్ ద‌ళాలు ఆప‌రేట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అమెరికా అధ్య‌క్షులు వాడే ఎయిర్ ఫోర్స్ వ‌న్ విమానం.. దాదాపు 1013 కిలోమీట‌ర్ల వేగంతో సుమారు 35వేల ఫీట్ల ఎత్తులో ప్ర‌యాణించ‌గ‌ల‌దు. అయితే ఇదే త‌ర‌హాలో ఎయిర్ ఇండియా వ‌న్ విమానం కూడా గంట‌కు 900 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించ‌నున్న‌ది. వైమానిక ద‌ళానికి చెందిన పైల‌ట్లు.. ఎయిర్ ఇండియా వ‌న్ విమానాన్ని ఆప‌రేట్ చేయ‌నున్నారు. రెండు విమానాల ఖ‌ర్చు సుమారు 8458 కోట్లు ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. శ‌త్రు రేడార్ సిగ్న‌ల్స్‌ను అడ్డుకునే జామ‌ర్లు ఉంటాయి. గాలిలోనే ఇంధ‌నాన్ని నింపుకునే సామ‌ర్థ్యం ఉంటుంది. ఎయిర్ ఇండియా వ‌న్‌లో అడ్వాన్స్‌, సెక్యూర్డ్ క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్ ఉన్న‌ది. ఆడియో, వీడియో క‌మ్యూనికేష‌న్‌.. మార్గ‌మ‌ధ్య ప్ర‌యాణంలో కూడా ప‌నిచేస్తాయి. హ్యాకింగ్ కానీ, టేపింగ్‌కు కానీ అవ‌కాశం లేకుండా క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ ప‌నిచేయ‌నున్న‌ది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/