అత్యవసర కేసుల్నిఇంటి నుంచే వాదించండి: సుప్రీం

అత్యవసర కేసులకు వీడియోకాన్ఫరెన్స్‌ వినియోగించుకోవాలని నాయ్యవాదులకు సుప్రీం సూచన

supreme court
supreme court

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ రోజురోజుకి విస్తరిస్తున్న నేపథ్యలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.అత్యవసర కేసుల్లో వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా న్యాయవాదులు ఇంటి నుంచే తమ వాదనలు వినిపించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే తెలిపారు. న్యాయవాదులు వీడియో కాల్‌ కనెక్ట్‌ చేసుకునేందుకు కొన్ని లింక్‌లు ఇస్తాం. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని మీ వాదనలు వినిపించండి అని బోబ్డే తెలిపారు. ఈరోజు సాయంత్రం నుంచి న్యాయవాదుల చాంబర్లన్నీ మూసివేస్తున్నామని, న్యాయవాదులు రేపు సాయంత్రానికల్లా ముఖ్యమైన పత్రాలు ఏమైనా ఉంటే తమ చాంబర్ల నుంచి తీసుకువెళ్లాలని సూచించారు. కరోనా కట్టడికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా సుప్రీం కోర్టు కూడా ఇలా స్పందించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/