కరోనా వైరస్‌తో అమెరికా పౌరుడు మృతి

US citizen dies - coronavirus
US citizen dies – coronavirus

బీజింగ్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగానే ఉంది. కరోనా బారినపడి మరణించిన వారి జాబితాలో విదేశీయులు కూడా చేరుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ పౌరుడు మృతి చెందినట్లు చైనాలోని ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. కరోనా బారిన పడి మరణించిన తొలి విదేశీయుడు ఇతడే కావొచ్చని భావిస్తున్నారు. 60ఏళ్ల ఓ అమెరికా పౌరుడు వుహాన్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 6న మరణించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారి కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేసిన రాయబార కార్యాయలం.. ఇతర వివరాలేవీ వెల్లడించలేమని తెలిపింది. తమ దేశంలో ఉన్న 19 మంది విదేశీయులకు వైరస్‌ సోకినట్లు చైనా ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/