సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా

UPSC Civil Services Exam 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా వేశారు. అయితే ఈ పరీక్షలు ఈ నెల 31న జరగాల్సి ఉంది. మే 20న పరిస్థితులను బట్టి కొత్త తేదీలను వెల్లడిస్తామని యూపీఎస్‌సీ ప్రకటించింది. భారత్‌లో ప్రస్తుతం మూడో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నెల 17 వరకూ ఈ లాక్‌డౌన్ ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి లాక్‌డౌన్ పొడిగించాలా వద్దా అనేది నిర్ణయిస్తారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/