రాజధాని ఎక్స్ప్రెస్లో ఇద్దరు కరోనా అనుమానితులు
కాజీపేట్ రైల్వేస్టేషన్లో దింపి గాంధీ ఆస్పత్రికి తరలింపు
Hyderabad: ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్లో ఇద్దరు కరోనా అనుమానితులను గుర్తించారు.
ఏప్రిల్ 5 వరకు ఎక్కడికి వెళ్లొద్దని వికారాబాద్ వైద్యులు హెచ్చరించినా వైద్యుల మాట వినకుండా రవి, పూజా అనే ఇద్దరు ప్రయాణికులు ఢిల్లిd బయల్దేరారు.
వారి చేతికి వైద్యులు చేసిన స్టాంప్ చూసి తోటి ప్రయాణికులు గుర్తించారు. వారిద్దరిని రైల్వే పోలీసులు కాజీపేట్ రైల్వేస్టేషన్లో దింపి గాంధీ ఆస్పత్రికి తరలించారు.
బీ-3 కోచ్లోని ప్రయాణికులను అధికారులు మరో బోగీలోకి పంపించారు. బీ-3 కోచ్ను సిబ్బంది శానిటైజేషన్ చేశారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం :http://epaper.vaartha.com/