పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..20 మంది మృతి

ఘాట్ రోడ్డుపై వెళుతూ అదుపుతప్పిన బస్సు 

Road accident
Road accident

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రావల్పిండి నుంచి స్కర్దుకు వెళుతున్న బస్సు ఘాట్ రోడ్డుపై అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సైనిక హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 8 మంది మృతదేహాల్ని బయటికి తీశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/