సబర్మతి ఆశ్రమానికి చేరుకున్న ట్రంప్
శాలువా కప్పి స్వాగతం పలికిన మోడి
అహ్మదాబాద్: భారత్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్కు మోడి కరచాలనం, ఆలింగనాలతో ఆహ్వానం పలుకగా, ఆపై, భారత సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేస్తూ సాగిన ఆహ్వాన కార్యక్రమం ట్రంప్ ను అబ్బరపరిచింది. శంఖాలు ఊదుతూ, డప్పు వాయిద్యాలు వాయిస్తూ, సంప్రదాయ నృత్యాలతో, గరగాటాలతో పలువురు ట్రంప్ కు స్వాగతం పలుకుతూ ఉంటే, వారందరినీ ఆశ్చర్యపూర్వకంగా చూస్తూ ట్రంప్ ముందుకు సాగారు. ఆపై యూఎస్ నుంచి వార్ షిప్ లో తెచ్చిన బీస్ట్ వాహనంలో మొతేరా స్టేడియంకు ఆయన పయనం అయ్యారు. అనంతరం ట్రంప్ సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన వారికి అడుగడుగునా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ట్రంప్ కంటే ముందే సబర్మతి ఆశ్రమానికి చేరుకున్న మోడి ..ట్రంప్ రాగానే శాలువా కప్పి స్వాగతం పలికారు. ఆశ్రమంలో గాంధీజీ చిత్రపటానికి నూలు దండ వేసి ట్రంప్ దంపతులు నివాళులర్పించారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలో గాంధీ చరఖాను తిప్పి ట్రంప్ నూలు వడికారు. అనంతరం సబర్మతీ ఆశ్రమంలో ఉన్న మూడు కోతుల బొమ్మలను ట్రంప్ దంపతులు చూసి ముచ్చటపడ్డారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/