లాక్డౌన్ పొడిగింపు ప్రచారంలో నిజం లేదు
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడి
దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం లాక్డౌన్ విదించిన సంగతి అందరికి తెలిసిందే. కాని ఈ లాక్డౌన్ను కేంద్రం పొడగిస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతం ఆవుతోంది.
దీంతో కేంద్రం ఖండించింది. కొన్ని రూమర్లు ప్రచారం అవుతున్నాయి. 21 రోజుల లాక్డౌన్ ముగిసిన తరువాత దాన్ని పొడిగిస్తారనడం నిరాధారం. అని కేంద్ర ప్రభుత్వ అధికారిక మీడియా విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీటీఐ) వెల్లడించింది.
లాక్డౌన్ ను పొడిగించే ఎటువంటి ఆలోచన కేంద్రం చేయడం లేదని, కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/