‘రియల్ హీరో’ జోగిందర్ శర్మ

ఐసీసీ ట్వీట్

Joginder Sharma

Haryana: భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మను రియల్ హీరోగా అభివర్ణిస్తూ ఐసీసీ ఈ ఉదయం ఒక ట్వీట్ చేసింది.

జోగిందర్ శర్మ అంటే 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో చవరి ఓవర్ లో పాకిస్థాన్ ను కట్టడి చేసి భారత్ కు విజయాన్ని అందించిన క్రికెటర్. 2018లో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జోగీందర్ శర్మ ఆ తరువాత అతడు హర్యానాలో డీఎస్పీగా పని చేస్తున్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ జోగీందర్ శర్మ కరోనా వ్యాప్తి నిరోధంలో ప్రజలలో అవగాహన పెంచేందుకు చురుగ్గా సేవలందిస్తున్నారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేసిన ఐసీసీ జోగీందర్ శర్మను రియల్ హీరోగా అభివర్ణించింది.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/