ప్రధాని ‘జనతా కర్ఫ్యూ’ సూచనలు పాటిద్దాం

ప్రపంచవ్యాప్త వైద్యసిబ్బందికి కోహ్లీ కృతజ్ఞతలు

team-india-responds-to-pm-modi-janata-curfew
team-india-responds-to-pm-modi-janata-curfew

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ ప్రధాని మోడి జాతినుద్దేశించి ప్రసంగించి. ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలిని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని పిలుపుకు టీమిండియా క్రికెటర్ల నుంచి విశేషమైన మద్దతు లభించింది. దీనిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ, దేశ ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రధాని మోడి చేసిన సూచనలను పాటిద్దాం అంటూ సూచించాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులను కాపాడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించాడు. మనం ఆరోగ్యంగా ఉండి వారికి సహకరిద్దాం అంటూ విజ్ఞప్తి చేశాడు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల శుభ్రత పాటించడం ఎంతో అవసరం అని కోహ్లీ స్పష్టం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా మోడి నిర్ణయాన్ని స్వాగతించాడు. ప్రధానితో చేతులు కలిపి జనతా కర్ఫ్యూలో పాలుపంచుకుందామని తెలిపాడు. రవిచంద్రన్ అశ్విన్, ధావన్, పంత్, కేఎల్ రాహుల్, రహానే, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్ సైతం ప్రధాని మోడి నిర్ణయానికి మద్దతు పలికారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/