లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 1,028.. నిఫ్టీ 316
ముంబయి: కరోనా భయాలు వెంటాడుతున్నప్పటికి నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 1,028 పాయింట్ల లాభంతో 29,468 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 316 పాయింట్ల లాభంతో 8,597 వద్ద ముగిసింది. నేడు 1,495 కంపెనీల షేర్ల ధరలు పెరగగా.. 767 కంపెనీల షేర్ల ధరలు తగ్గుముఖం పట్టాయి.మరో 150 కంపెనీల షేర్ల ధరలలో ఎటువంటి మార్పులేదు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/