కేరళలో రెండో రోజు సున్నా కేసుల నమోదు

నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారన్న సిఎం

Pinarayi Vijayan
Pinarayi Vijayan

తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గు ముఖం పడుతుంది. గత రెండు రోజుల నుంచి కేరళలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాదు ఈరోజు 61 మంది పేషెంట్లు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 34 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఈ సందర్భంగా సిఎం పినరయి విజయన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 499 పాజిటివ్ కేసులు నమోదు కాగా నలుగురు మాత్రమే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కాగా మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలోనే నమోదైంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/