భారత్కు రష్యా ఎస్ 400 మిస్సైల్స్
New Delhi: భారతదేశానికి 2025 నాటికి ఎస్ 400 మిస్సైల్స్ను అందజేస్తామని రష్యా మిషన్ డిప్యూటీ చీఫ్ రోమన్ బబుష్కిన్ చెప్పారు. భారత్కు అందజేయనున్న ఎస్ 400 మిస్సైల్స్ ఉత్పత్తి ప్రారంభమైందని ఆయన అన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మార్చి 22నుంచి రెండు రోజులపాటు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా-ఇండియా-చైనా త్రైపాక్షిక చర్చల్లో ఆయన పాల్గొంటారు. ఎస్ 400 మిస్సైల్స్ ఇప్పటి వరకూ రష్యా రక్షణ శాఖకు మాత్రమే అందుబాటులో ఉండేవి.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/v