భారత్‌ ఓ అద్భుత మేధావిని కోల్పోయింది

ప్రణబ్‌ మృతికి సంతాపం తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్

Russian President Vladimir Putin expresses grief over Pranab

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటించినట్లు ఇక్కడి ఆ దేశ రాయబారి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడిలకు తన సందేశం పంపినట్లు పేర్కొంది. ‘రాష్ట్రపతిగా ఇతర బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ స్వదేశంతోపాటు అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. నిజమైన స్నేహితుడిగా రష్యాభారత్‌ నడుమ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. భారత్‌ ఓ అద్భుత మేధావిని కోల్పోయింది’ అని పుతిన్ తన సందేశంలో పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/