ఈడీ ఎదుట హాజరైన రియా చక్రవర్తి
సుశాంత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు
Mumbai: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈడీ ఎదుట హాజరైంది.
సుప్రీంలో తన పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు తన స్టేట్ మెంట్ ను రికార్డు చేయవద్దని ఈడీని రియా కోరింది.
అయితే, ఆమె విన్నపాన్ని ఈడీ అధికారులు తిరస్కరించి , ఈరోజు విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేయడంతో విధిలేని పరిస్థితుల్లో ముంబైలోని ఈడీ కార్యాలయానికి ఆమె హాజరైంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/