రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం

వేతనాల్లో 10 నుంచి 50 శాతం కోతలు.. వార్షిక వేతనం రూ.15 లక్షలు మించినవారికే కోత

Mukesh ambani
Mukesh ambani

ముంబై: కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక నిర్ణయం తీసుకుంది.ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ప్రకటించింది. వేతనాల్లో 10 నుంచి 50 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపింది. వార్షిక వేతనం రూ.15 లక్షలు కన్నా తక్కువ ఉన్నవారికి కోతలు వర్తించవని సంస్థ పేర్కొంది. రూ.15 లక్షల కంటే ఎక్కువ వేతనాలు ఉంటే 10 శాతం కోత, బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు, సీనియర్ లీడర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం కోత అమలు చేయనున్నారు. ఇక, ఏడాదికి రూ.15 కోట్ల వరకు వేతనం అందుకునే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తన వార్షిక వేతనాన్ని పూర్తిగావదులుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ వ్యయాలను భరించాలంటే ఇది తప్పదని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/telangana/