మోడి ప్రభుత్వం తీరుపై రాహుల్‌ మండిపాటు

rahul-gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మోడి ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎంతమంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయార‌ని కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ‌లో ప్ర‌శ్నించింది. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరింది. అయితే, కాంగ్రెస్ ప్ర‌శ్న‌కు కేంద్ర‌ కార్మిక‌, ఉపాధి క‌ల్ప‌నశాఖ‌‌ మంత్రి సంతోష్‌ కుమార్ గంగ్వార్ స‌మాధానం ఇస్తూ తాము వ‌ల‌స ‌కార్మికుల‌కు సంబంధించి ఎలాంటి రికార్డులు మెయింటెయిన్ చేయ‌లేద‌ని, ఆ లెక్కలు తమ వద్ద లేవని ‌ చెప్పారు. దాంతో న‌రేంద్రమోడి ప్ర‌భుత్వ తీరుపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ‘మోడి గవర్నమెంట్‌కు ఎంత మంది ఉద్యోగం కోల్పోయారో, ఎంత మంది చనిపోయారో తెలియదు. మీకు లెక్క తెలియదు అంటే ఎవరు చనిపోలేదని అర్థమా? ఎవరు ఉద్యోగం కోల్పోలేదని అనుకోవాలా? అని రాహుల్‌ ప్రశ్నించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/