నీరవ్‌ మోడి రూ.330 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ముంబయి, లండన్, యూఏఈలోని ఆస్తులు స్వాధీనం

Nirav Modi
Nirav Modi

న్యూఢిల్లీ: నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర ముంచేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నీరవ్ మోడికి చెందిన దాదాపు రూ. 330 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. నీరవ్ మోడి పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది. నీరవ్‌కు చెందిన రూ.2,348 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే స్వాధీనం చేసుకోగా, తాజాగా, ముంబయిలోని వర్లి ప్రాంతంలో ఉన్న సముద్ర మహల్, బీచ్ ఒడ్డున ఉన్న విలాసవంతమైన ఫాం హౌస్, రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని విండ్‌మిల్, లండన్‌, యూఏఈలోని ఫ్లాట్లను జప్తు చేసింది. వీటి విలువ రూ.330 కోట్లని ఈడీ తెలిపింది. కాగా లండన్‌లో ఉన్న నీరవ్ మోడిని గతేడాది అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్తుల ఒప్పందం కింద అతడిని దేశానికి రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/