రేపు లక్నోలో ప్రధాని మోడి పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి రేపు లక్నోలో పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడి లక్నోలో డిఫెన్స్ ఎక్స్పోను ప్రారంభించనున్నారు. ఐదు రోజుల పాటు కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో వెయ్యికిపైగా జాతీయ, అంతర్జాతీయ రక్షణ రంగ సంస్థలు పాల్గొననున్నాయి. డిఫెన్స్ ఎక్స్పో సమయంలో గంటకు 2,700 కిలోమీటర్ల వేగంతో యుద్ధ విమానాలు ప్రయాణించనుండటంతో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/