పరుచూరి వెంకటేశ్వరరావు భార్య మృతి

సంతాపం తెలిపిన సినీ ప్రముఖులు

paruchuri-venkateswara rao-wife-died

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) గుండెపోటుతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. దీంతో పరుచూరి ఇంట విషాదం నెల‌కొంది. విజ‌య‌ల‌క్ష్మీ మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తూ, వెంక‌టేశ్వ‌ర‌రావుకి ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, పరుచూరి సోదరులుగా అశేష సినీ ప్రేక్షకులకు సుపరిచితులైన వీరిద్దరూ, అందరు స్టార్ హీరోలతోనూ పనిచేసి, ఎన్నో హిట్స్ అందించిన సంగతి తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/