పార్లమెంట్ సమావేశాలు కుదించనున్న కేంద్రం!
కరోనా బారిన పడుతున్న ఎంపీలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను కుదించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా బారిన పడుతున్న ఎంపీల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటికే దాదాపు 30 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత సమావేశాలు ఈ నెల 14 నుంచి అక్టోబర్ 1 వరకు జరగనున్నాయి. పార్లమెంటు ప్రాంగణం వద్ద అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం పునరాలోచనలో పడింది. సమావేశాల రోజులను కుదించే యోచనలో కేంద్రం ఉందని పార్లమెంట్ అధికారులు చెపుతున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/