ఐరాసలో పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు

కశ్మీర్‌ అంశం భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని ఐరాస స్పష్టం చేసింది

Imran Khan
Imran Khan

ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌ విషయంలో అడుగడుగునా దెబ్బతిన్న పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. జమ్మూ కశ్మీర్‌ అంశాన్ని ఐక్యారాజ్యసమితిలో లెవనెత్తేందుకు చేసిన విఫల ప్రయత్నం బెడిసి కొట్టింది. కశ్మీర్‌ అంశం భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని ఐరాస స్పష్టం చేసింది. పాక్‌ కుయుక్తులపై భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది. కుట్రలను పక్కనపెట్టి ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే అంశంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది. కాగా కశ్మీర్‌ విషయంలో తొలి నుంచి పాక్‌కు చైనా మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా దాయాది దేశానికి డ్రాగన్‌ తప్ప మరే ఇతర సభ్య దేశాలు అండగా నిలవకపోవడం గమనార్హం. ఓ ఆఫ్రికన్‌ దేశానికి చెందిన అంశంపై ఐరాస భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) బుధవారం రహస్య సమావేశానికి పిలుపునిచ్చింది. దీంట్లో చర్చించాల్సిన ఇతర అంశాల జాబితాలో కశ్మీర్‌ విషయాన్ని చేర్చాలని చైనా కోరింది. కానీ, ఇతర సభ్యదేశాలు అంగీకరించకపోవడంతో చైనాకు భంగపాటు తప్పలేదు. పైగా కశ్మీర్‌ భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది.

తాజా ఎపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/