మా చర్యలు ఫలిస్తున్నాయి: ట్రంప్
న్యూయార్క్, న్యూజెర్సీ, మిషిగాన్, లూసియానా లలో క్రమంగా తగ్గుతున్న వైరస్ ప్రభావం
వాషింగ్టన్: అమెరికాలో కరోనా కట్టడికి తాము తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న న్యూయార్క్, న్యూజెర్సి, మిషగాన్, లూసియానా లలో క్రమంగా వైరస్ ప్రభావం తగ్గుతుందని తెలిపారు. కాగా అమెరికాలో నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 1,509 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 23,539 కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు 5,87, 583 మంది కరోనా భారిన పడ్డారు. ఒక్క న్యూయార్క్ లోనే మరణాల సంఖ్య 10,107 కు చేరుకుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/