నాకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదు

తమిళనాడులో రాజకీయ సుస్థిరత లోపించింది

rajinikanth
rajinikanth

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పలు అంశాలను ప్రజలతో మాట్లాడానికి ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. ఈనేపథ్యంలో రజనీ మాట్లాడుతూ..’1996కి ముందు ఏనాడు రాజకీయాల గురించి నేను ఆలోచించలేదు. ఈ విషయంపై ప్రజలు నన్ను ఎప్పుడు అడిగినా దేవుడి దయ అని చెప్పాను. రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తానని చెప్పాను’ అని తెలిపారు.’నేను ఒక విషయంలో అసంతృప్తితో ఉన్నాను. నా అసంతృప్తి గురించి చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అన్ని ఊహాగానాలకు నేడు ఫుల్‌స్టాప్ పెడుతున్నాను. 201617లో తమిళనాడులో రాజకీయ సుస్థిరత లోపించింది. మంచివారు రాజకీయాల్లోకి రావట్లేదు’ అని చెప్పారు. ‘వ్యవస్థను సరిచేయకుండా మార్పురావాలని కోరుకోవడం సరికాదు. నేను పార్టీ ప్రారంభిస్తున్నాను. నాకు ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదు. నీతి, నిజాయతీ, ప్రజల మనసులో స్థానం ఉన్నవారికే సీఎం అయ్యే అర్హత ఉండాలి. నా పార్టీలో 60 నుంచి 65 శాతం వరకు యువతకే అవకాశం’ అని రజనీకాంత్ చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/