మళ్లీ లాక్ డౌన్ కు అవకాశం లేదు
ట్విట్టర్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడి
New Delhi: రానున్న రోజుల్లో ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచనేదీ లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
చాలామంది ప్రజలు ఢిల్లీలో మరోసారి లాకడౌన్ విధిస్తారన్న ఊహల్లో ఉన్నారని, కానీ అలాంటి ప్రణాళిక లేవీ లేవని ట్విట్టర్లో సీఎం కేజ్రీవాల్ సోమవారం పేర్కొన్నారు.
ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఆమ్ఆద్మీపార్టీ ఎంపీ సంజయ్ సింగ్ హాజరై ఢిల్లీతోపాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దవాఖానల్లో పడకల సంఖ్య పెంచాలని కోరినట్లు వెల్లడించారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/