నీట్, జేఈఈ పరీక్షల కొత్త తేదీలు

జులై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్… జులై 26న నీట్

JEE Main, NEET 2020 exam

న్యూఢిల్లీ: కేంద్రం వివిధ పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది. జులై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ సోషల్ మీడియాలో విద్యార్థులతో నిర్వహించిన లైవ్ ఇంటరాక్షన్‌లో ఈ కాంపిటీటీవ్ పరీక్షల తేదీలను వెల్లడించారు. కాగా నీట్ జులై 26న ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఆగస్టులో జరగొచ్చని అన్నారు. పరీక్ష తేదీలు ఇంకా నిర్ణయించలేదు. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల కొత్త తేదీలు ఈ వారంలో ప్రకటిస్తారు. కాగా, ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం 9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. నీట్ కోసం దేశవ్యాప్తంగా 15.93 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/