నిజామాబాద్‌ కార్పోరేషన్‌ టిఆర్‌ఎస్‌ కైవసం

trs party
trs party

నిజామాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ నిజామాబాద్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. కార్పొరేషన్లో 60 డివిజన్లు, 7 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. బిజెపి 28 స్థానాలు, ఎంఐఎం 16, టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 2, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. దీంతో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 34 ఉండాలి. బీజేపీకి 28, ఎంపీ అరవింద్ ఎక్స్ అఫీషియో కలుపుకొని మొత్తంగా 29కు చేరింది. మ్యాజిక్ ఫిగర్ సరిపోకపోవడంతో అపోజిషన్లో ఉంటామని ఎంపీ అరవింద్ ప్రకటించారు. అటు టిఆర్‌ఎస్‌ పార్టీకి 13, ఎంఐఎం 16, ఒక ఇండిపెండెంట్, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు, ఎక్స్అఫిషియో ఓట్లు టీఆర్ఎస్ కు 6 ఉన్నాయి. ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు విజి గౌడ్, ఆకుల లలిత, రాజేశ్వర్ లు ఓటింగ్లో పాల్గొన్నారు. దీంతో టిఆర్‌ఎస్‌ బలం 38కి చేరింది. మేయర్ గా టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 11వ వార్డు దండు నీతో కిరణ్, డిప్యూటీ మేయర్ గా ఎంఐఎం అభ్యర్థి 14వ వార్డు మహమ్మద్ ఇద్రిస్ ఖాన్ ఎన్నికయ్యారు. మొత్తంగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయింది. మూడో స్థానానికి పరిమితమైన టిఆర్‌ఎస్‌ ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/