మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

CM Shivraj Singh Chouhan

భోపాల్‌: ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర పౌరులకు మాత్రమే ఇవ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఈ విషయాన్ని సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర యువతను ఆదుకుని వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. దీని కోసం అవసరమైన చట్టపరమైన చర్యలు చేపడతామని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. కాగా, ఏపి, హర్యానా సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలను ఆ రాష్ట్రానికి చెందిన స్థానికులకే ఇచ్చేందుకు బిల్లులను కూడా ప్రవేశపెట్టాయి. ప్రైవేట్ ఉద్యోగాలను కూడా రాష్ట్రంలోని వారికే కేటాయించాలని కొన్ని రాష్ట్రాలు పేర్కొన్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/