బిజెపిలోకి నటుడు మోహన్బాబు..?
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబు ప్రధాని నరేంద్రమోడిని కలిసారు. వీరిద్దరు
దాదాపు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈభేటి సందర్భంగా మోహన్బాబాను ప్రధాని మోడి బిజెపిలోకి ఆహ్వానించినట్లు సమాచారం. కాగా ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్షాను కూడా మోహన్బాబు కలవనున్నారు. ప్రధానితో భేటీ అయిన సమయంలో ఆయనతో పాటు కుమారుడు మంచు విష్ణు, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కోడలు విరోనిక ఉన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/